నేడు కూడా పైకే!

SMTV Desk 2019-05-25 15:43:00  Petrol, Deseal, Price, New delhi

వరుసగా మూడో రోజు కూడా దేశీయ ఇంధన ధరలు పైకి కదిలాయి. శనివారం పెట్రోలు ధర 14 నుంచి 15 పైసలు .. డీజిల్ ధర 12 నుంచి 13 పైసల మేర పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోలు ధర 14 పైసలు పెరిగి రూ.71.53 కి చేరగా.. డీజిల్ ధర 12 పైసలు పెరిగి రూ.66.57 కి చేరింది. అలాగే వాణిజ్య రాజధాని ముంబయిలోని 14 పైసలు పెరిగిన లీటర్ పెట్రోలు ధర రూ.77.14 కి చేరగా.. డీజిల్ ధర 12 పైసలు పెరిగి రూ.69.75 వద్ద కొనసాగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 19 నుంచి శనివారం (మే 25) వరకు.. అంటే వారం రోజుల వ్యవధిలో పెట్రోలు ధర 50 పైసలు, డీజిల్ ధర 60 పైసల మేర పెరిగింది. దీంతో పెట్రో భారం మరింత పెరుగుతుందనే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 14 పైసలు పెరగి రూ.75.86 వద్ద ఉండగా.. డీజిల్ ధర 13 పైసలు పెరిగి 72.80కి చేరింది. అమరావతిలో పెట్రోలు ధర 15 పైసలు పెరిగి రూ.75.86 వద్ద, 13 పైసలు పెరిగిన డీజిల్ ధర రూ.71.75 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోలు ధర 15 పైసలు పెరిగి రూ.75.27 వద్ద, 12 పైసలు పెరిగిన డీజిల్ ధర రూ.71.42 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.46 శాతం పెరుగుదలతో 67.47 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.24 శాతం పెరిగి 58.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది.