న్యూఢిల్లీ, ఆగస్ట్ 26 : నిరుద్యోగులకు రైల్వే శాఖా తీపి కబురందించింది. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నడుం బిగించింది. భారతీయ రైల్వేలో 19,952 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఉద్యోగాలకు రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి పాసై 18-25 సంవత్సరాల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తం ఉద్యోగాల్లో జనరల్ కేటగిరికి 8901, ఓబీసీకి 4371, ఎస్టీకి 3363, ఎస్సీకి 3317 ఉద్యోగాలను కేటాయించారు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అక్టోబర్ 14 చివరి తేదీ కాగా, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది.