మీడియాలో వస్తున్న కథనాలు చూసి తాను అవెంజర్స్.. ఎండ్ గేమ్ సినిమాకు వెళ్లానని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. కానీ తనకు ఈ సినిమా నచ్చలేదనీ, నిరాశకు గురయ్యానని వ్యాఖ్యానించారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాతో పోల్చుకుంటే బాహుబలిని రాజమౌళి చాలా బాగా తీశారని ప్రశంసించారు.
బాహుబలి సినిమాతో రాజమౌళి సినిమా సాధించిన విజయంపై గర్వపడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. గత నెల 26న విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.16,364 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది.