విశాఖ, ఆగస్ట్ 25: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భాజాపాతో జత కట్టనుంది అనే ఊహాగానాలకు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తెరదించారు. అసలు వైసీపీతో చేతులు కలపాలన్న యోచన భాజాపాకు లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో తాము టీడీపీతో కలిసి ఉన్నామని చెప్పారు. భవిష్యత్లో టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. కాగా, పొత్తులపై ఢిల్లీలోని భాజాపా అధిష్టానం నిర్ణయం ఆమె పేర్కొన్నారు. దీంతో వైసీపీ కూడా ఎన్డీఏలో కలవబోతోందని ఇటీవల వచ్చిన వార్తలన్నీ అసత్యాలని పురంధేశ్వరి తెలిపారు.