వీహెచ్- నగేష్‌ల మధ్య వాగ్వాదం

SMTV Desk 2019-05-24 14:20:26  vh

హైదరాబాద్ : ఇంటర్ బోర్డు అవకతవకలపై, ఇంటర్ విద్యార్థల ఆత్మహత్యలపై విపక్షాల నేతలు శనివారం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, టీపీసీసీ సెక్రటరీ నగేష్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.



తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా కోసం వేసిన కుర్చీలో నగేష్ కూర్చున్నాడు. దీంతో నగేష్ పై విహెచ్ మండిపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో నగేష్ కింద పడిపోయారు. అనంతరం విహెచ్ ను లాగడంతో ఆయన కూడా కింద పడిపోయారు. విపక్ష నేతలు జోక్యం చేసుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో సమస్య సద్దుమణిగింది.