ముంబై, ఆగస్ట్ 25 : ఇన్ఫోసిస్ కంపెనీకి సీయీవో, ఎండీగా ఉన్న విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేయడంతో కంపెనీ షేర్లు నష్టాలను చవి చూశాయి. దీంతో కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకనిని కంపెనీలోకి తీసుకురావాలని సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ సీయీవోగా కూడా నందన్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ నేపధ్యంలో నీలేకనిని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమిస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇన్వెస్టర్లు, ఇతర సహ వ్యవస్థాపకుల ఒత్తిడి మేరకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నందన్ నీలేకని తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. "26ఏళ్ల వయసులో ఇన్ఫోసిస్లో చేరాను.. మళ్లీ 62ఏళ్ల వయసులో పునరాగమనం చేస్తున్నాను. జీవితం గుండ్రంగా తిరగడమంటే ఇదేనేమో!" అంటూ ట్విట్ చేశారు.