రెండు దేశాల మధ్య సిరీస్ ముంగిట ఆటగాళ్లు, అభిమానులు సూటిపోటి మాటలతో తమ ప్రత్యర్థులను రెచ్చగొట్టడం మనకు తెలిసిందే . కానీ, తమ దేశం ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు వస్తున్న ఆస్ట్రేలియా టీమ్ ను ఇంగ్లండ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. బాల్ ట్యాం పరింగ్ వివాదంలో నిషేధం ఎదుర్కొని ఆసీస్ టీమ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లండ్ టీమ్ అభిమాన సంఘమైన బర్మీ ఆర్మీ.. వార్నర్ ను మోసగాడు అంటూ తన ట్విటర్ లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ లో కంగారూ జట్టు వాడే జెర్సీని ధరించి న వార్నర్ ఫొటోను ఫొటోషాప్ చేసి ఆస్ట్రేలియా పేరు స్థానంలో చీట్స్ అని రాసింది. అంతటితో ఆగకుండా నేథన్ లైయన్ , మిచెల్ స్టార్క్ చేతిలో బంతికి బదులు సాండ్ పేపర్ పెట్టి అక్కసు వెళ్లగక్కింది. దీంతో వరల్డ్ కప్ కోసం మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ కు వెళ్లబోతున్నఆసీస్ జట్టు .. అక్కడి ఇంగ్లండ్ టీమ్ ప్యాన్స్ నుంచి ఎలాంటి అనుభవం ఎదురవుతుందోనని కంగారు పడుతోంది.