అమిత్ షా విజయవాడ పర్యటన వాయిదా..

SMTV Desk 2017-08-25 17:36:02  BJP PARTY, PRIME MINISTER NARENDRA MODI, RAJYASABHA MEMBER AMITH SHAA

న్యూఢిల్లీ, ఆగస్ట్ 25 : బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా ఈ నెల 28 నుండి 30 వరకు విజయవాడలో పర్యటించవలసి ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి విస్తరణ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆయన పర్యటన వాయిదా పడింది. అమిత్‌ షా పర్యటనపై సెప్టెంబర్‌ మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశముందని రాష్ట్ర భాజపా నేతలు తెలిపారు. ఈ నేపధ్యంలో రేపే కేంద్ర మంత్రివర్గ విస్తరణ పనులు జరుగుతున్నాయని వార్తలు రావడంతో.. తమ విధి నిర్వాహణలో చురుకుగా పనిచేయని కేంద్ర మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. కొందరు జేడీయూ నేతలు మోదీ కేబినెట్‌లోకి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.