ఇన్ఫోసిస్ లో చేరనున్న ఎస్‌బీఐ చైర్మన్..??

SMTV Desk 2017-08-25 15:47:06  SBI CHAIRMAN, ARUNDATHI BATTAACHARYA, INFOSIS, BOARD MEMBER, INFOSIS EX. CEO VISHAL SIKAA

ముంబై, ఆగస్ట్ 25 : ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్యాకు ఇన్ఫోసిస్ నుండి తమ బోర్డులో చేరాలని ఆహ్వానం వెళ్ళినట్లు సమాచార౦. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... అక్టోబ‌ర్ 6న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న అరుంధతీ భట్టాచార్యకు ఇన్ఫోసిస్ మాజీ సీయీవో విశాల్ సిక్కా రాజీనామా చేయడానికి ఒక పది రోజుల ముందు నుంచే ఈ-మెయిల్స్ వెళ్ళినట్లు తెలుస్తోంది. మరో ఐటీ కంపెనీ కూడా ఆమెకు ఆఫర్ అందించగా ఇన్ఫోసిస్ లో చేరేందుకే తను మొగ్గు చూపనున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాతా కొంత విరామం తీసుకొని ప్రైవేటు ఉద్యోగాల్లో చేరతారు. దీంతో అరుంధతీ కూడా కొంత విరామం తీసుకున్నాకే చేరాతారేమోనని ఇన్ఫోసిస్‌ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆమె కనుక ఇన్ఫోసిస్ లో చేరితే కిర‌ణ్ మ‌జుందార్ షా, పుణీతా కుమార్ సిన్హా, రూపా కుద్వాల తో పాటు కంపెనీ బోర్డులో ఆమె నాలుగో మహిళ అవుతారు. అయితే ఈ విషయంపై అరుంధతీ నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు.