రాజకీయాలంటే ప్రాణం... నంద్యాలలో గెలుపు... : లగడపాటి రాజగోపాల్

SMTV Desk 2017-08-25 15:06:14  EX MP, Congress Senior,Lagadapati Rajagopal, Nandyala by-polls Result, lagadapati survey

ఢిల్లీ, ఆగస్ట్ 25: ఎన్నికల ఫలితాల సర్వేలో తనదైన ముద్ర వేసుకున మాజీ కాంగ్రెస్ నేత,విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నంద్యాల ఫలితాలపై సంచలన ప్రకటన చేశారు. ఈ ఉపఎన్నికపై తన ఫ్లాస్ టీం సర్వే వివరాల ప్రకారం విజయం టీడీపీ అభ్యర్థిదే అంటూ ఆయన ప్రకటించారు. ప్రజా తీర్పు టీడీపీ వైపే ఉందని ఆయన తెలిపారు. టీడీపీ గెలుపుకు ఏ అంశాలు దోహదం పడ్డాయని మాత్రం తాను తెలపలేనన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి పున:ప్రవేశంపై స్పష్టత ఇచ్చేశారు. తనకు రాజకీయాలంటే ప్రాణం కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల్ల రాజకీయాల నుండి తప్పుకున్నానని, ఎలాంటి పరిస్థితులలో కూడా మళ్లీ రాజకీయాల్లోకి రాబోనని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా దేశవ్యాప్తంగా సర్వేలు జరిపిస్తాను, అది నా వ్యాపకం. కాబట్టి నిరంతరం రాజకీయాలపై విశ్లేషణలు కొనసాగిస్తానని ఆయన చెప్పారు.