తిరుమల, ఆగస్ట్ 25 : ఏపీలో నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడప, చిత్తూరు, ఒంగోలు, ప్రకాశ౦ జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి పోర్లుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కొండపై నుండి బండరాళ్లు జారిపడ్డాయి. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కాని ట్రాఫిక్ కి మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.