నంద్యాల, ఆగస్ట్ 25: ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి రోజుకో సంచలనం చోటు చేసుకుంటున్న నంద్యాలలో తాజాగా మరో సంచలనం దుమారం రేపుతుంది. ఈ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఓ వెబ్ న్యూస్ చానల్పై కేసు నమోదైంది. నంద్యాల ఉపఎన్నికపై ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సదరు వెబ్ చానల్ నిబంధనలను ఉల్లంఘించి ఎగ్జిట్ ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.