లక్నోఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ కైలాహట్ వద్ద గురువారం కామాఖ్య ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఇంజిన్, జనరేటర్ రూమ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై రైలు నుంచి జనరేటర్ రూమ్, పార్శిల్ కోచ్ను వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఢిల్లీ-హావ్డా రహదారిలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు. రైలుకు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు.