రాజ్యసభ సభ్యులుగా అమిత్ షా, స్మృతి ఇరానీ ప్రమాణస్వీకారం

SMTV Desk 2017-08-25 10:46:01  RAAJYA SABHA, SMRUTHI IRAANI, AMITH SHAA, VICE PRESEDENT VENKAYYA NAYUDU, PARLAMENT

న్యూఢిల్లీ, ఆగస్ట్ 25 : రాజ్యసభ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ప్రమాణస్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ అసెంబ్లీ నుంచి వీరిద్దరూ ఈ నెలలోనే రాజ్యసభకు ఎన్నికైన విషయం విదితమే. అయితే ప్రమాణ స్వీకారం అనతరం స్మృతి ఇరాని వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పార్లమెంటేరియన్ గా స్మృతి కి ఇది రెండోసారి కాగా, అమిత్ షా ఎన్నికవడం ఇదే మొదటిసారి. బీజీపీకి రాజ్యసభలో తగిన౦త మెజారిటీ లేకపోవడం కారణంగా ఈ ఇద్దరు ఎన్నికవడంతో మరింత బలం చేకూరింది.