కర్ణాటక, ఆగస్ట్ 24: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి చెందారు. కర్నాటకలోని మాగుడి ప్రాంతంలో ఆగి ఉన్న ట్యాంకర్ను కారు ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి గురైన యువ నటి రచన, నటుడు జీవన్లను మిత్రులు స్థానిక హాస్పటల్కు తరలించగా చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వీరు మహానది, త్రివేణి సంగమ, మధుబాల లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించారు. కాగా, మిత్రులతో కలిసి బెంగుళూరు దగ్గరలోని సుబ్రమణ్య స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వీరితో పాటు ప్రయాణిస్తున్న మిత్రులకు స్వల్ప గాయాలయ్యాయి.