ఛత్తీస్ఘడ్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దంతేవాడ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులకు, సాయుధ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.ఘటనా స్థలి నుంచి ఒక రైఫిల్, 12బోర్ తుపాకీ, మందుగుండు సామాగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.