స్కిల్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్తో టాలీవుడ్లోనూ అడుగుపెట్టారు.
తాజాగా మరో చాలెంజింగ్ రోల్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. హ్యూమన్ కంప్యూటర్గా పేరు తెచ్చుకున్న గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్లో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అను మీనన్ దర్శకత్వం వహిస్తారు. విక్రమ్ మల్హోత్రా నిర్మాత. ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.