హైదరాబాద్, ఆగస్ట్ 24 : ట్రిపుల్ తలాక్ విధానం ఫై సుప్రీమ్ కోర్టు నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే , ఈ తీర్పును ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్లు స్వాగతించాయి. కాగా, ఆలిండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ మాత్రం తీర్పును గౌరవిస్తూనే భిన్నంగా స్పందించింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విలేకరులతో మాట్లాడారు. "న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనం తప్పక గౌరవించాలి. అయితే ఇది ఏకపక్షంగా వచ్చిన తీర్పుకాదని గుర్తుంచుకోవాలి. తలాక్ రద్దు తీర్పును క్షేత్రస్థాయి అమలు చేయాలంటే చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది"" అని ఓవైసీ అన్నారు