తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచరిస్తుండడం కలకలం రేపింది. 52వ మలుపు వద్ద వాహనదారులు చిరుతను చూశారు. దీంతో నడకదారి భక్తులు, వాహనదారులు భయాందోలన వ్యక్తం చేస్తున్నారు. టిటిడి సిబ్బంది సైరన్ మోగించడంతో చిరుత అడవిలోకి వెళ్లింది. నడకదారిలో వచ్చే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని అధికారుల సూచించారు. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమైంది.