లాహోర్‌లో బాంబు పేలుడు....ఐదుగురు మృతి

SMTV Desk 2019-05-08 12:32:49  bomb attack in lahore, lahore bomb attack 5 people died

ఇస్లామాబాద్: బుధవారం ఉదయం లాహోర్ లో బాంబు పేలుడు సంభవించింది. లాహోర్‌లోని డాటా దర్బార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందాగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. బాంబు పేలుడు ధాటికి రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. శవ పరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడింది ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో తెలియరాలేదని డిఐజి(ఆపరేషన్స్ లాహోర్) అహ్మద్ ఖాన్ తెలిపారు. పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగినట్టు అర్ధమవుతుందని ఆయన చెప్పారు.