సూపర్ స్టార్ మహేష్ పరధ్యానంలో ఉన్నాడు. దర్శకుడు కథ చెబుతున్నా వినకుండా.. రబ్బరు బ్యాండుతో ఆడుకొంటున్నాడు. ఐతే, ఇది మహేష్ తొలి సినిమా ‘రాజకుమారుడు’ నాటి ముచ్చట. మహేష్ నటించిన 25వ చిత్రం మహర్షి. వంశీ పైడిపలి దర్శకుడు. ఈ వారం (మే9) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ తన తొలి సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపారు.
రాఘవేంద్రరావు, మహేశ్ కలసి ఉండగా పరుచూరి బ్రదర్స్ ‘రాజకుమారుడు’ కథను చెప్పారట. వాళ్లు కథ చెబుతుంటే.. మహేశ్కు మాత్రం రబ్బర్ బ్యాండుతో ఆడుకొంటూ ఉన్నాడట. అలా పరుచూరి బ్రదర్స్ కథ చెబుతున్నంత సేపూ మహేశ్ ఆడుతూనే ఉన్నాడట. వాళ్లు కథ చెప్పి వెళ్లిపోయాక రాఘవేంద్రరావు మహేశ్ను పిలిచి ‘నీకు కథ నచ్చకపోయినా… నచ్చినట్లు ప్రవర్తించు. నువ్విలా ఆడుకుంటే దర్శకుడి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది’ అని చెప్పారట. ఆ తర్వాత మళ్లీ తానెప్పుడూ అలా చేయలేదని చెప్పుకొచ్చారు మహేష్.