దేశ ప్రజలకు ప్రధాని మోదీ రంజాన్ మాసం శుభాకాంక్షలు

SMTV Desk 2019-05-07 13:21:48  ramzan, pm modi, saudi arabia, saudi jail

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ప్రధాని ఆకాంక్షించారు. అంతకు ముందు రోజు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయులను రంజాన్‌ పర్వదినంలోగా వదలిపెట్టడానికి సౌదీ అరేబియా అంగీకరించిందని ప్రధాని మోదీ తెలిపారు.

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం సోమవారం (మే 6న) ప్రారంభమైంది. రంజాన్ నెల ఆరంభం నుంచి ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రతి రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. వేకువ జామున 4 గంటలకు అల్పాహారాన్ని తీసుకుంటారు. దీన్నే సహారీ అంటారు. తెల్లవారిన దగ్గర్నుంచి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా దీక్షను పాటించి తరువాత దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. ఈ నెలలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు తమ ధనంలో రెండున్నర శాతం సొమ్మును దానం చేస్తారు. ఈ మాసంలోనే హజ్ యాత్ర చేస్తారు.