ముంబై: ప్రముఖ కిరాణ సరుకుల ఆన్లైన్ సంస్థ బిగ్బాస్కెట్లో మరిన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చెయ్యడానికి ముందుకొచ్చాయి. మిరే అస్సెట్ ఆసియా గ్రోత్ఫండ్, అలీబాబా, బ్రిటన్కు చెందిన సిడిసి గ్రూప్లు దాదాపు 150 మిలియన్ డాలర్లు బిగ్బాస్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈమేరకు సంస్థ సహ వ్యవస్థాపకుడు విపుల్ పరేఖ్ మీడియాతో తెలిపారు. ఈ మొత్తాన్ని కంపెనీ గోదాములు, రవాణ సౌకర్యాలు మెరుగు పర్చి డెలివరీ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా ఆన్లైన్ కిరాణ వ్యాపారం వృద్ధిని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. అయితే ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నందున పెట్టుబడి వివరాలను సంస్థ వెల్లడించలేదు. బిగ్బాస్కెట్లో అలీబాబా ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, అతిపెద్ద ఇన్వెస్టర్గా నిలిచింది.