ముంబై, ఆగస్ట్ 23: స్మార్ట్ఫోన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న రెడ్ మి కంపెనీకి చెందిన రెడ్ మి 4 మొబైల్ ఫోన్ ప్రతీ వారం నిర్వహించే ఫ్లాష్ సేల్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ ను ఫ్లాష్ సేల్లో దక్కించుకోలేకపోయిన వినియోగదారులకు శుభవార్త. ఇప్పడి నుండి ఈ మొబైల్ను ఓపెన్ సేల్లో ఉంచనున్నట్టు షియోమి ఇండియా అధికారి మనుకుమార్ జైన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం రెడ్ మి 4కు సంబంధించిన అన్ని వేరియంట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. కేవలం, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ మాత్రమే ఓపెన్ సేల్లో లభిస్తుందని తెలిపారు. కాగా దీని ధర రూ.10,999గా వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ నుండి తదుపరి ఫ్లాష్ సేల్ ఉంటుందని, 2 జీబీ, 3 జీబీ ర్యామ్ కలిగిన రెండు వేరియంట్లను విక్రయిస్తామని తెలిపారు. ఓపెన్ సేల్ ద్వారా విక్రయిస్తున్న మొబైల్ను ఎంఐ ఇండియా లేదా అమెజాన్ వెబ్ సైట్లో పొందవచ్చని పేర్కొన్నారు.