దక్షిణాఫ్రికా, ఆగస్ట్ 23 : ఒక వ్యక్తి మనుషుల్ని చంపి తింటున్నారన్న వార్త దక్షిణాఫ్రికాలో హల్ చల్ సృష్టిస్తోంది. అదేంటి..? మనిషిని చంపి తినడమా అని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. గత కొంత కాలంగా మనుషులు కనిపించకుండా పోతున్నారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని అమా౦గ్వే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక మహిళను చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఆమె అవయవాలను తినేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా దర్యాప్తును ప్రారంభించిన పోలీసులకు ఒక ప్రదేశంలో కుండలో పోగు చేసిన మానవ శరీర అవయవాలు కనిపించగా ఒక్కసారిగా పోలీసులు షాక్కి గురయ్యారు. ఇంతలోనే తనకు మనుషుల్ని తిని తిని విసుగొస్తుందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతటితో ఆగకుండా అక్కడున్న టేబుల్ మీద మనిషి కాలు, చెయ్యి పెట్టాడు. దీంతో అవాక్కైన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.