ఇంటిలిజెంట్ సినిమా తర్వాత దర్శకుడు వి.వి.వినాయక్ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తారని వార్తలు వినపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు వినాయక్ ఓ రీమేక్ తెరకెక్కించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. తమిళంలో మాధవన్, విజయ్సేతుపతి, శ్రద్ధా శ్రీనాథ్, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `విక్రమ్ వేద`.
తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఆ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించబోతన్నారని టాక్. తమిళంలో పోలీస్ ఆఫీసర్గా కనిపించిన మాధవన్ పాత్రలో నారా రోహిత్, గ్యాంగ్స్టర్గా నటించిన విజయ్ సేతుపతి పాత్రలో విక్టరీ వెంకటేష్ కనపడనున్నారట. త్వరలోనే సినిమాకు సంబంధించిన సమాచారం వెలువడనుంది.