బాస్కెట్‌బాల్‌ టోర్నీ ఫైనల్లో పాంథర్స్‌, సింహా జట్లు

SMTV Desk 2019-05-05 18:00:35  sampathkumar center of excellence prathibhanweshana basket ball tournament

హైదరాబాద్‌: సంపత్‌కుమార్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రతిభాన్వేషణ బాస్కెట్‌బాల్‌ టోర్నీలో పాంథర్స్‌, సింహా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు బాలిక విభాగంలో ఫైనల్లోకి అడుగుపెట్టాయి. శనివారం జరిగిన సెమీస్‌లో పాంథర్స్‌ 73-32 తేడాతో వైఎంసీఏ సికింద్రాబాద్‌పై విజయం సాధించింది. ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయించిన పాంథర్స్‌ తొలి అర్ధభాగం ముగిసే సరికి 41-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విరామం తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. పాంథర్స్‌ జట్టులో రుచి (20), జోషిక (20), హిత (15), లాస్య (14).. వైఎంసీఏ తరపున రియా (16), యశస్విని (6) రాణించారు. మరో సెమీస్‌లో సింహా 59-43తో ఎంజీఎం అంతర్జాతీయ పాఠశాలపై గెలిచింది.