కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఓ ఉగ్రవాదిని గారు అని పొగిడి ఇరకాటంలో పడ్డారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీహార్లోని రామ్ గడ్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను జీ అని వ్యాఖ్యనించారు. ఉగ్రవాదిని పొగడడంపై బిజెపి నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. గతంలో బీహార్ నేత జీతన్ రాం మాంజీ అనే నేత ‘మజూర్ అజార్ సాహెబ్’ (సర్) సంభోదించడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బిజెపి వాళ్లే ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్నారని ఎన్డిఎ ప్రభుత్వంపై కాంగ్రెసోళ్లు, ప్రాంతీయ పార్టీలు విరుచుకపడ్డాయి. ఉగ్రవాదిని గౌరవంగా పిలువడంతో ప్రతిపక్షాలు ఏమంటాయోనని బిజెపి నేతలకు భయం పట్టుకుంది. ఇప్పటికే బిజెపి అగ్రనాయకులు సదరు మాటలపై సిన్హాకు క్లాస్ పీకినట్టు సమాచారం.