ఆదిలాబాద్, ఆగస్ట్ 23 : ఆదిలాబాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్ బాపూజీ ఇంట్లో అనిశా దాడులు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏక కాలంలో హైదరాబాద్, ఆదిలాబాద్ లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బండ్లగూడలో రెండు కోట్ల విలువైన విల్లా, సోమాజిగుడలో ప్లాట్, హయత్ నగర్ లో ఇంటి స్థలాన్ని అధికారులు గుర్తించారు. అటు ఆదిలాబాద్ లోను రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో నగదు, బంగారం, పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై బాపూజీ భార్య స్పందిస్తూ.. "మా వద్ద ఎలాంటి అక్రమాస్తులు లేవు, మేము లోన్స్ తీసుకొని ఇల్లు కొనుకున్నాం. మా దగ్గర అన్నింటికీ సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయి. బ్యాంకు అకౌంట్స్ కూడా ఎవరి పేరు మీద లేవంటూ" తెలిపారు. బండ్లగూడ, మేడ్చల్, సోమాజిగూడలలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.