చంద్రబాబుకు సిఈసీ షాక్

SMTV Desk 2019-05-05 17:21:57  cm, cec

అమరావతి: రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల సంఘం శక ఇచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని చంద్రబాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఈసీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. దీనికి సమాధానంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా ఆదరణ పథకం కింద కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయద్దని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది.