ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని లార్కానాలో ఓ వైద్యుడు ఘోరానికి పాల్పడ్డాడు. అతనికి అతి భయంకర వ్యాధి ఎయిడ్స్ సోకిందని తట్టుకోలేక ఆ వ్యాధిని అతను మరో 90 మందికి సోకేలా చేశాడు. పూర్తి వివరాల ప్రకారం...పాకిస్తాన్లోని లార్కానా పట్టణంలో నివసిస్తున్న ఓ డాక్టర్...తనకు ఎయిడ్స్ సోకిందన్న నిజాన్ని జీర్ణించుకోలేక అక్కసుతో 90 మందికి హెచ్ఐవీ ఇంజక్షన్లు వేశారు. వీరిలో 65 మంది బాలలు కూడా ఉన్నారు. ఊరు శివారు ప్రాంతానికి చెందిన 18 మంది పిల్లలు ఇటీవల అనారోగ్యం బారిని పడ్డారు. వారి రక్తాన్ని పరీక్షించగా హెచ్ఐవీ వైరస్ సోకినట్లు తేలింది. వారి తల్లిదండ్రులు డాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిడ్స్ డాక్టరు అరెస్టు చేశారు. కాగా, పాకిస్తాన్లోని హైదరాబాద్ నగరంలో ఎయిడ్స్ రోగులు సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు చెప్పారు.