యుపిలో 74 స్థానాల్లో గెలుస్తాం

SMTV Desk 2019-05-04 17:08:15  amit shah,

లక్నో : లోక్ సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. యుపిలో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యుపిలో తాము 74 స్థానాల్లో గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల్లో గట్టి గుణపాఠం తప్పదని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీయే మళ్లీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అమిత్ షా చెప్పారు. ఏళ్ళ తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రజలకు చేసందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగానే ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో నక్సలిజం పెరిగిందని, రాజ్ నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అయిన నాటి నుంచి దేశంలో నక్సలిజం తగ్గుముఖం పట్టిందని ఆయన పేర్కొన్నారు.