తిరుమల: వారం రోజుల లోపు వెండినిల్వలు లెక్కించాలని టిటిడి ఈఓ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. సింఘాల్ పరకామణిలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆయన ప్రత్యేక ద్రుష్టి సారించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే వెండి నిల్వల లెక్కింపు కోసం..ఒక అప్రైజర్, 30 మంది మజ్దూరులను ఈఓ సింఘాల్ నియమించారు. ఇప్పటికే నాణేల నిల్వల లెక్కింపు పూర్తి అయింది.