కొలంబో: శ్రీలంకలోని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు ఇప్పుడు భారత్ లో కూడ అటువంటి ప్రమాదఘంటికలు కనిపిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. భారత్లో ఐసిస్ మూలాలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని ఈస్టర్ ఆత్యాహుతి దాడులు వెల్లడిస్తున్నాయి. అయితే శ్రీలకంలో దాడులకు పాల్పడిన వారు శిక్షణ నిమిత్తం కశ్మీర్, కేరళాలకు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని శ్రీలంకకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేననాయకే వెల్లడించినట్లు పేర్కొంది. శ్రీలంక బాంబర్లకు భారత్లో సంబంధాన్ని ఒక సీనియర్ సైనిక అధికారి పేర్కొనడం ఇదే తొలిసారి. అయితే బెంగళూరు, కేరళ, కశ్మీర్లలో ఉన్నట్లు మావద్ద సమాచారం ఉంది. బహుశ వారు శిక్షణ నిమిత్తం వెళ్లి ఉండవచ్చు. లేదా, ఇతర గ్రూపులతో కూడా సంబంధాలు పెంచుకొనే అవకాశం ఉంది అని సేననాయకే తెలిపారు.