సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి మరో యాంగిల్ చూస్తే షాక్

SMTV Desk 2019-05-04 12:30:26  Srinivas reddy, hajipur,

మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకొని తన పశువాంఛ తీర్చుకున్న తర్వాత కర్కశంగా అంతమొందించిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి సంబందించిన మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నరగా తనతో చనువుగా ఉంటున్న ఓ యువతి విషయంలో మాత్రం అతను ఎలాంటి సైకో లక్షణాలు చూపకుండా ప్రవర్తించాడు. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఈ సైకో సదరు అమ్మాయితో మాత్రం భిన్నంగా ప్రవర్తించడంపై పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఓ యువతితో చనువుగా ఉంటున్నాడు. ఆ యువతితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ అమ్మాయికి సంబంధించిన వివరాల గురించి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువతిగా గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో వేములవాడ ఆలయానికి వెళ్లిన సందర్భంలో ఆమె పరిచమైనట్లు సమాచారం.

లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి వేములవాడలోనూ కొంత కాలం పనిచేసినట్లు ఆ క్రమంలో సదరు యువతితో ప్రేమలో పడినట్టు త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిండు. అమ్మాయిలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన హాజీపూర్ సైకో కిల్లర్.. ఆ యువతితో మాత్రం అంత అదుపుగా ఎలా ఉండగలిగాడనేది చర్చనీయాంశంగా మారింది. దీన్ని పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తన ప్రకారం మహిళలపై కన్నేసిన అతడు తొలుత తన కోరికను బయటపెడతాడు. వాళ్లు ఎదిరించినప్పుడు మాత్రమే అత్యాచారం చేసి, హతమార్చడమో అంతమొందించి తన పశువాంఛ తీర్చుకోవడమో చేస్తాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డితో చనువుగా ఉంటున్న యువతి అతడి ప్రతిపాదనకు అంగీకరించి ఉంటుందని భావిస్తున్నారు.