వరుసగా క్షీణిస్తున్న పసిడి విలువ

SMTV Desk 2019-05-04 12:27:26  Gold rate, Bullion market

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు కూడా పసిడి ధర క్షీణిస్తూ వస్తుంది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,470కు పడిపోయింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.37,700 వద్దే కొనసాగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 1,275.45 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.86 శాతం పెరుగుదలతో 14.74 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,470కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,300కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది.కేజీ వెండి స్థిరంగా రూ.37,700 వద్ద కొనసాగితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.66 క్షీణతతో రూ.36,308కు దొగిచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.78,000 వద్ద, అమ్మకం ధర రూ.79,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,420కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,920కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.39,500కు దిగొచ్చింది.