ఫణి ఎఫెక్ట్ : కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం

SMTV Desk 2019-05-03 18:22:21  odisha, vamshadaara river, fani cyclone, srikakulam, vijayanagaram

ఫణి తుపాను కారణంగా శ్రీకాకుళంలో భారీ వర్షపాతం నమోదైంది. వంశధార నదికి భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ముప్పు తప్పింనది అధికారులు వెల్లడించారు. అయితే ఒడిశా మాత్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురు గాలులు, కుంభవృష్టి వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్రజలు సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఒడిశాలోని రవాణా వ్యవస్థ స్తంభించింది. తాజాగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.