టీ20 ర్యాంకింగ్స్...మరింత దిగజారిన టీంఇండియా

SMTV Desk 2019-05-03 18:02:21  icc t20 rankings 2019, team india, pakistan

దుబాయి: ఇంటర్నెషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) తాజాగా టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత జట్టు మూడు స్థానాలు దిగజారి ఐదో ర్యాంక్ కు పరిమితమైంది. పాకిస్థాన్ 286 పాయింట్లు సాధించి నెం.1 స్థానంలో నిలిచింది. టెస్టుల్లో అగ్రస్థానం, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్ జట్టు అనూహ్యంగా 260 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం. టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ తర్వాత 262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూజిలాండ్ (254) ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (241), శ్రీలంక (227), వెస్టిండీస్ (226), బంగ్లాదేశ్ (220) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. 2016 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. ఐసీసీ ఇక నుంచి 80 జట్లకి సంబంధించిన టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు జాబితాలో యూఏఈ, నమీబియా, హాంకాంగ్, నెదర్లాండ్స్‌, గన్యా, నైజీరియా, దక్షిణ కొరియా తదితర జట్లు కూడా చేరాయి.