ఫణి ప్రభావం: తీరం దాటినా తగ్గని జోరు

SMTV Desk 2019-05-03 16:19:31  andhra, hurricane, odisha, fani cyclone

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాక్షిక ప్రభావం చూపించిన ఫణి తుపాను ఒడిశాపై అరివీరభయంకరంగా విరుచుకుపడింది. ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తీరందాటిన ఈ తీవ్ర పెనుతుపాను ధాటికి ఒడిశా తీరం చిగురుటాకులా కంపించిపోయింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ఫణి ప్రభావానికి గురయ్యాయి.

గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో హరికేన్ స్థాయిలో గాలులు వీయడంతోపాటు, అతి భారీవర్షాలు ఒడిశాలోని పూరీ, భువనేశ్వర్ తదితర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. తీరం దాటిన చాలాసేపటి వరకు ఫణి ఎంతో తీవ్రతగా కొనసాగింది. దీనికి ప్రస్తుతం బాలాసోర్ మీదుగా కోల్ కతా, బంగ్లాదేశ్ దిశగా పయనిస్తున్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది.