నేపాల్ ను వణికిస్తున్న 'బర్డ్ ఫ్లూ'

SMTV Desk 2019-05-03 12:41:38  nepal, bird flu

నేపాల్: నేపాల్ లో బర్డ్ ఫ్లూ జబ్బు కలకలం సృష్టిస్తోంది. బర్డ్ ఫ్లూ అనే కొత్త వ్యాధితో 21 ఏళ్ల ఓ యువకుడు మరణించడంతో నేపాల్ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కవరేపాల్ అంచక్ జిల్లాకు చెందిన ఓ యువకుడు జ్వరంతో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే మృతుడికి బర్డ్ ఫ్లూ సోకిందని పరీక్షల్లో తేలడంతో మెడికల్‌ డిపార్ట్‌ మెంట్‌ అలర్ట్‌ అయంది. కోళ్ల ద్వార వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ నిరోధానికి ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలెవరు చికెన్‌ తినొద్దని హెచ్చరించింది.