గుంటూరులో దారుణం...కారు కాలువలో పడి ఇద్దరు మృతి

SMTV Desk 2019-05-03 11:50:22  guntooru, car fell down in canal in guntooru

గుంటూరు: శుక్రవారం ఉదయం గుంటూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల ప్రకారం...శుక్రవారం ఉదయం రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ కారును, అందులోని మృతు దేహాలను బయటికి తీశారు. మృతులు వినుకొండకు చెందిన మహేంద్ర (24), అశోక్‌ (26)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మహేంద్ర, అశోక్ మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.