వన్డే ర్యాంకింగ్స్‌...రెండో స్థానంలో టీంఇండియా

SMTV Desk 2019-05-03 10:12:14  icc, icc odi rankings, teamindia, australia

న్యూఢిల్లీ: తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీంఇండియా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు 123 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా కేవలం రెండు పాయింట్ల వ్యత్యాసం కారణంగా భారత్ (121) రెండో ర్యాంక్‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీమిండియా తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (115), న్యూజిలాండ్ (113), ఆస్ట్రేలియా (109), పాకిస్థాన్ (96), బంగ్లాదేశ్ (86), వెస్టిండీస్ (80), శ్రీలంక (76), అఫ్గానిస్థాన్ (64) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.టెస్టు ర్యాంకింగ్స్.. గత ఏడాది కాలంగా విదేశాల్లో సైతం ఘన విజయాల్ని అందుకున్న భారత్ జట్టు 113 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. రెండు పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ (111) రెండో స్థానానికి పరిమితమైంది. ఇక మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (108) ఆ తర్వాత ఇంగ్లాండ్ (105), ఆస్ట్రేలియా (98), శ్రీలంక (94), పాకిస్థాన్ (84), వెస్టిండీస్ (82), బంగ్లాదేశ్ (65), జింబాబ్వే (16) టాప్-10లో నిలిచాయి. ఇంగ్లాండ్ జట్టు గత రెండేళ్లుగా వన్డేల్లో అసాధారణ ఆటతీరుతో దూసుకెళ్తోంది. ఎంతలా అంటే.. ఈ మధ్యకాలంలో ఆ జట్టు ఏకంగా 400పైచిలుకు పరుగుల్ని మూడు సార్లు సాధించింది. అయితే.. ఇప్పటి వరకూ ఒక్క ప్రపంచకప్‌‌ని కూడా ఆ జట్టు గెలవలేకపోయింది. కానీ.. ఈ ఏడాది సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో.. ఆ జట్టు గట్టి పోటీదారని ర్యాంకింగ్స్‌ ద్వారా అర్థమవుతోంది