ఫణి ఎఫెక్ట్ : 103 రైళ్ళు రద్దు

SMTV Desk 2019-05-02 16:12:00  indian railways, fani tsunami

ఫణి తుఫాను వల్ల దేశంలో మొత్తం 103 రైళ్లను రద్దు చేసి మరో రెండు ట్రైన్లను దారి మళ్ళించింది ఇండియన్ రైల్వే శాఖ. ఈ తుపాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు 19 జిల్లాలపై ప్రతికూల ప్రభవం పడే అవకాశముంది. భద్రాక్-భువనేశ్వర్-పూరీ-విశాఖపట్నం మధ్య ఎలాంటి రైళ్లు తిరగడం లేదు. దీంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వే నుంచి భువనేశ్వర్, పూరీ, విశాఖపట్నం, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాలు వెళ్లే రైళ్లు రద్దు కావొచ్చు. లేదా దారి మళ్లించొచ్చు. రద్దయిన, దారి మళ్లించిన ట్రైన్లకు ఫుల్ రిఫండ్ ఇస్తామని రైల్వే విభాగం ప్రకటించింది. జర్నీ డేట్ తర్వాతి మూడు రోజుల్లోగా క్యాన్సల్ చేసుకోవాలని సూచించింది. రద్దయిన ట్రైన్లలో హౌరా-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్, హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్- భువనేశ్వర్, హౌరా-హైదరాబాద్, హైదరాబాద్-హౌరా, సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రబాద్, సికింద్రాబాద్-గువాహతి, గువాహతి-సికింద్రాబాద్, పూరీ-తిరుపతి, తిరుపతి-పూరీ, సికింద్రాబాద్-షాలిమార్, భువనేశ్వర్-సికింద్రాబాద్ రైళ్లు కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.