హైదరాబాద్, మే 02: అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయికగా షాలినీ పాండే చాలా వరకు మేకప్ లేకుండా సహజంగా కనిపించి ప్రేక్షకుల మదిని దోచేసింది. సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి వరుస సినిమాలతో దూసుకుపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు.
కానీ ఈ సినిమా సక్సెస్ తరువాత అంతగా గుర్తింపు లేని పాత్రలను ఎంచుకుని వెనుకబడిపోయింది. ఇటీవల వచ్చిన 118 చిత్రంలో మాత్రం గ్లామర్ పరంగా తన నటనకు మెరుగులు అద్దింది. తాజాగా మరో ప్రేమకథలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.
రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అవికా గోర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి షాలినీ పాండేను తీసుకున్నారా? లేదంటే అవికాతో పాటు షాలినీని తీసుకున్నారా? ఇది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే.