తెలుగు రాష్ట్రాల వెబ్సైట్లు హ్యాకర్ల చేతిలోకెల్లాయి. తాజాగా ఒకేసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కంలో వెబ్సైట్లు హ్యాక్కు గురయ్యాయి. రాన్సమ్ వేర్ వైరస్ పేరుతో టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్సైట్లలోని డేటాను హ్యాక్ చేశారు. అనంతరం రూ.35కోట్లు డిమాండ్ చేశారు. అయితే డేటా బ్యాకప్ ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. దీనిపై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్ కింద సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.