జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఈ విషయాన్ని భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో అంతర్జాతీయంగా భారత్ దౌత్యం ఫలించింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి అతని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను ఐక్యరాజ్య సమితి స్తంభింపజేసింది.మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా నాలుగు సార్లు వివిధ కారణాలతో అడ్డుపడింది. గత మార్చిలో కూడా సాంకేతిక కారణాలను చూపుతూ.. ఓటింగ్ లో పాల్గొనలేదు. ఎట్టకేలకు చైనాపై భారతదేశానిదే పై చేయి అయింది. మసూద్ను ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది.