టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటొకార్ప్ నుండి తాజాగా ఓ సరికొత్త బైక్ మార్కె్ట్లో లాంచ్ అయ్యింది. ఎక్స్ట్రీమ్ 200ఎస్ అనే పేరుతో విడుదలైన ఈ బైక్ ధర రూ.98,500 (ఎక్స్షోరూమ్ ఢిల్లీ). కంపెనీ ఈ ఎక్స్ట్రీమ్ 200ఎస్ బైక్తోపాటు ఎక్స్పల్స్ 200, ఎక్స్పల్స్ 200టీ అనే మరో రెండు అడ్వైంచర్ బైక్స్ కూడా లాంచ్ చేసింది. ఆకట్టుకునే లుక్, సూపర్ స్టైలిష్ డిజైన్ వంటివి హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ బైక్ సొంతం. హెడ్లైట్ డిజైన్ చూస్తే వావ్ అంటాం. ఇందులో కొత్త అలాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఇంజిన్ కిల్ స్విచ్చ డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, సర్వీస్ రిమైండర్, గేర్ ఇండికేటర్ వంటి చాలా ఫీచర్లున్నాయి. రెడ్, బ్రైన్, బ్లాక్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. ఇందులో 199.6 సీసీ ఇంజిన్, 5 స్పీడ్ గేర్ బాక్స్, టెలిస్కోసిక్ ఫోర్క్స్, డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. అలాగే కంపెనీ బైక్ హ్యాండిల్బార్ మీద కూడా తగిన శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. హ్యాండిల్బార్ రైడర్లకు అనువుగా ఉంది.