చిన్నారికి అన్నం పెట్టకుండా కాటికి పంపిన పెంపుడుతల్లి

SMTV Desk 2019-05-01 17:52:55  emany, tifany, Georgia, emany case

జార్జియా: జార్జియాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి తన పెంపుడు కూతురికి తిండి పెట్టకుండా నరకం చూపించి మృత్యు వాత పడేలా చేసింది. ఆలస్యంగా బయటికొచ్చిన ఈ సంఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఈ అమానుష సంఘటన అమెరికాలోని జార్జియాలో చోటుచేసుకుంది. పదేళ్ల ఎమానీ మోస్ అనే బాలికను అతి దారుణంగా చాలా రోజుల పాటు అసలు ఆహారమే పెట్టకుండా, ఆకలితో నకనకలాడి చనిపోయేలా చేసింది. అయితే ఈ దయనీయమైన పరిస్థితులు దావురించేలా చేసిన ఆమె పెంపుడు తల్లికి న్యాయస్థానం మరణ శిక్ష వేసింది. ఎమానీ చనిపోయే సమయానికి ఆమె బరువు కేవలం 14 కిలోలేనట. అంటే బాలిక ఎంత నరకం అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. బెడ్ పై నుంచి కదలలేని స్థితిలో శరీర వ్యర్థాల మధ్య అత్యంత దారుణ పరిస్థితుల్లో ఎమానీ చనిపోయింది. ఈ కేసులో ప్రధాన నేరస్థురాలైన ఎమానీ పెంపుడు తల్లి టిఫనీ మోస్‌కు జార్జియా కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ఎమానీ మృతదేహాన్ని తగలబెట్టడంతో పాటు హత్య విషయాన్ని దాచిపెట్టడంలో భార్యకు సహకరించిన ఎమానీ తండ్రి ఎమాన్ మాస్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. కాగా, 2013లో జరిగిన ఈ ఘోరాతి ఘోరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.