టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం మహర్షి. ఊపిరి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషికి జోడిగా పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం మే 1న ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి.. బుధవారం సాయంత్రం 6 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇవాళ రాత్రి 8.10 గంటలకు ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే మహర్షి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు మహర్షి టీం.
అయితే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో అదే తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు చిత్రబృందం. మహేష్ బాబు నటించిన గత సినిమా దర్శకులుగా కూడా ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించారు. అల్లరి నరేష్ మహేష్ బాబు స్నేహితుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా మహర్షి విడుదల కానుంది.