మసూద్‌ కథ ముగిసినట్టే!!

SMTV Desk 2019-05-01 15:23:33  masood azhar, jaish e mohammed, germeny, united nation organisation, international terrorist, usa

జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చర్యలు బలోపేతంగా మారుతున్నాయి. ఈ విషయంలో మసూద్ ని ఎప్పుడూ వెనకేసుకస్తున్న చైనాకూడా మొండిచేయి చూపేలా కనిపిస్తుంది. ఇవాళ మసూద్‌ కేసు ఐక్యరాజ్యసమితి ముందుకు రానుంది. ఇన్నాళ్లూ మసూద్‌ను వెనకేసుకొస్తున్న చైనా ఇవాళ ఆంక్షల కమిటీ ముందు పంతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా మెట్టు దిగితే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్‌ డిమాండ్‌ కు ఆమోదముద్ర పడే ఛాన్సెస్‌ మెండుగా ఉన్నాయి. ఇవాళ ఇదే జరిగితే మసూద్‌ విషయంలో భారత్‌ మరో దౌత్య విజయం సాధించినట్టు అవుతోందంటున్నారు విశ్లేషకులు.